Thursday, April 16, 2020

thumbnail

About Ram Karri ౹ రామ్ కర్రి జ్ఞాన కేంద్ర...




రామ్ కర్రి గురించి - About Ram Karri





తూర్పుగోదావరి జిల్లా , రాయవరం మండలం, రాయవరం గ్రామానికి చెందిన రామ్ కర్రి - నవ యువ కవి, రచయిత, బ్లాగర్, సాంకేతిక గురు, సామాజిక కార్యకర్త, పాత్రికేయులు, సామాజిక మాధ్యమాల్లో తెలుగు వినియోగాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన తెలుగు భాషా సైనికుడు.

ఈయన  2008 నుండే అంతర్జాలంలో అనేక వెబ్సైట్ల ద్వారా తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన కృషీవలుడు

మరియు 

భారతీయ సంస్కృతి- సంప్రదాయాలను, నైతిక విలువల్ని, సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలని తపించే మహర్షి.



జననం - విద్య

ఈయన  కర్రి సుబ్రహ్మణ్యం, గంగాభవాని దంపతులకు, ఆయన అమ్మమ్మ ఊరు అయిన అదేయ్ జిల్లాకు చెందిన రంగంపేట మండలం, కోటపాడు గ్రామంలో జులై 16 1990 సంవత్సరం లో జన్మించారు...

ఈయన అమ్మమ్మ ఊరు అయిన కోటపాడు గ్రామంలో 5 వ తరగతి వరకు స్వగ్రామం అయిన రాయవరం లో 10 వరకు , అనపర్తి లో ఇంటర్మీడియట్ వరకు మరియు హైదరాబాద్ లో డిగ్రీ మరియు ఇతర సాంకేతిక పరమైన చదువుల్ని చదవడం జరిగినది...



తెలుగు భాషా సంరక్షణ వేదిక



తెలుగు భాష అభివృధి కోసం పాటుపడే సామాన్యులలో ఈయన కూడా ఒకరు...

                  “ తెలుగుభాషా సంరక్షణ వేదిక ” అనే ఒక సంస్థ ని ఏర్పాటు చేసి ఈ సంస్థ ద్వారా మన  తెలుగు భాష కి అలనాటి వైభవాన్ని తీసుకురావాలనే ఆకాంక్ష తో మన తల్లి భాషనీ మరచిపోతున్నా నేటి తరానికి ,ఆ...నుండి వ్యాకరణం, పద్యాలు, పాటలు, కవితలు, కథలను మరియు ఆనాటి కవుల గురించి వాళ్ళ రచనల గురించి మరొక మారు గుర్తు చేసి, మన తెలుగు యొక్క గొప్పదనాన్ని ప్రతి ఒక్కరికీ తెలిసేలా ముఖ పుస్తకలలోను, సామజిక వెబ్సైటుల ద్వారా మరియు వెబ్సైట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

అలాగేయ్ తెలుగు కవులను, రచయితలను ప్రోత్సహిస్తూ...

  నేటితరం కవుల రచనలను మన ఈ తెలుగుభాషా సంరక్షణ వేదిక లో పొందుపరుస్తూ సమాజానికి పరిచయం చేస్తున్నారు.

అలాగే తెలుగు భాష కోసం కృషి చేసే వాళ్ళను ప్రోత్సహిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.

వాట్సప్ లలో సమూహాలను ఏర్పరచి అభివృధి వైపుగా అడుగులు వెయ్యడం జరుగుతుంది...

రేపటి తరం మన తెలుగు గొప్పదనం తెలుసుకోవాలనే ఉద్యేశం తో తెలుగు భాషా సంరక్షణ వేదిక అనే వెబ్సైట్ ని రూపొందించి అందులో పొందుపరచడం జరుగుతుంది...

అలాగే తెలుగు గ్రంథాలయం ని ఏర్పాటు చేసి తద్వారా ప్రతీ తెలుగు పుస్తకాన్ని పిడిఎఫ్ రూపంలో అందించి పుస్తక జ్ఞానాన్నీ చేకూర్చడం జరుగుతున్నది..

ఈ విధంగా ఆయన తెలుగు భాష అభివృధి కోసం  కృషి చేస్తున్నారు...



రామ్ కర్రి పబ్లికేషన్స్

అదే విధంగా నవ కవుల రచనలను రామ్ కర్రి పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించడం జరుగుతున్నది..





రాంకర్రి జ్ఞాన కేంద్ర


మన పూర్వీకులు అందించిన అపూర్వ సంపద అయిన విజ్ఞానాన్ని, భారతీయ సిద్ధాంతాల్ని, భారతీయ సంస్కృతి - సంప్రదయాల్ని , నైతిక విలువల్ని, సనాతన ధర్మాన్ని

మరియు
మన పూర్వీకుల నుండి మనం గ్రహించ లేకపోయిన మరెన్నో అద్భుతమయిన విషయాలను భావి తరాలకు అందించాలనే దృఢ సంకల్పం తో " రాంకర్రి జ్ఞాన కేంద్ర " అనే ఒక స్వచ్ఛంద సంస్థ ని స్వగ్రామం అయిన రాయవరం లో స్థాపించడం జరిగినది.

అటువంటి అద్భుతమైన విషయాలను ప్రపంచంలో ఉన్న ప్రతీ తెలుగు వారు పొందాలి అనే ఉధ్యేశం తో…

 ఆ సంస్థ యొక్క అధికారిక వెబ్సైట్ అయిన www.ramkarri.org   ద్వారా స్వచ్ఛందం గా అందించడం జరుగుతుంది…

అలాగే 276 వాట్సాప్ సమూహాలు మరియు టెలిగ్రామ్ గ్రూప్ ల ద్వారా కూడా ప్రజలకుఅద్భుతమైన విషయాలను అందిస్తున్నారు.

భారతీయ సంస్కృతీ - సంప్రదాయాలు, విజ్ఞానం , సనాతన ధర్మం , భారతీయ సిద్ధాంతాలు, నైతిక విలువలు అలాగే అనేక అద్భుతమైన విషయాలు అన్నీ ఒకే చోట లభిస్తున్నాయి కనుక ఈ వెబ్సైట్ ని " విలువల నిఘంటువు " అని కూడా అభివర్ణిస్తూ ఉంటారు వీక్షకులు.



ప్రాణధాత ఫౌండేషన్


   
      " ప్రాణధాత ఫౌండేషన్ " అనే సేవా సంస్థ ని ఏర్పాటు చేసి, రక్త దాతలను సమాచారం అందివ్వడానికి వీలుగా జిల్లా ల వారిగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి, మరియు " ప్రాణధాత బ్లాగ్ " లో రక్త దాతల వివరాలను పొందుపరచడం జరిగినది.  

రక్తం అవసరమైన వాళ్ళు ఫోన్ చేయడానికి వీలుగా 8096339900 చరవాణి సంఖ్యను అందుబాటులో ఉంచి,

                 మన తెలుగు రాష్ట్రాలలోని వారికి ఎవరికైనా రక్తం అవసరం అయి పై నెంబర్ కి ఫోన్ చేసిన లేదా వాట్సాప్ లో సందేశం పంపిన వెంటనే ఆ సందేశాన్ని రక్త గ్రహిత యొక్క జిల్లాలో దగ్గరలో ఉన్నవారికి ఆ సమాచారం అందించి వాళ్ళచే రక్త దానం చేయించడం జరుగుతుంది.



వైద్య నిలయం 



            ఆరోగ్యమే మహాభాగ్యము మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా, ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవి కి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము.

ఎవరికైనా ఏదయినా ఆరోగ్య సమస్య ఉంటే దాని గురించి సరియైన అవగాహన లేక చాలా బాధపడుతూ ఉంటారు.

                               వారి కోసం వైద్య నిలయం అనే వాట్సాప్ గ్రూపులను నడుపుతున్నారు అందులో నిపుణులు అయిన ఎందరో వైద్యుల్ని ని అడ్మిన్ గా నియమించి ఎవరికైనా ఏదయినా ఆరోగ్య సమస్య, సందేహాలు ఉంటే దానిని సమూహం లో పెడితే వాటికి అనుభవజ్ఞులైన వైద్యులు సలహాలు, సూచనలు అందిస్తారు.

అలాగే ఎన్నో ఆరోగ్య సూచనలను వైద్యుల పర్యవేక్షణలో ఈ వైద్య నిలయం బ్లాగ్ ద్వారా అందిస్తున్నారు.



సాంకేతిక విజ్ఞానం

                     ప్రతీ తెలుగు వారు సాంకేతిక విజ్ఞానాన్ని నేర్చుకోవాలనే తపనతో " సాంకేతిక విజ్ఞానం " అనే ఒక బ్లాగ్ ని తయారు చేసి తద్వారా సాంకేతిక పరమైన విషయాలను అచ్చమైన తెలుగు లో అందిస్తున్నారు.

అదే విధంగా విద్యార్థులకు సాంకేతిక పరమైన ఎన్నో సందేహాలకు అంతర్జాలం లోనే  సందేహ నివృత్తి చేస్తున్నారు...

     సాంకేతిక పరమైన విద్యలను తెలుగు తెలిసిన ప్రతీ ఒక్కరూ అభ్యసించాలి అనే ఆతృత తో అచ్ఛమైన తెలుగులోనే ఉచితం గా " సాంకేతిక విజ్ఞానం " ద్వారా అందిస్తున్నారు.



            తెలుగు ఎడమ చేతి వాటం వాళ్ళ సంఘం                   ( Telugu Lefties Club - TLC )


ప్రపంచం లో ఉన్న తెలుగు ఎడమ చేతి వాటం వాళ్ళందరినీ ఒక తాటి పైకి తీసుకొని వచ్చి , ఆలోచనలను పంచుకొని సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఏర్పాటు చేసారు.. తెలుగు ఎడమ చేతి వాళ్ళ సంఘాన్నీ తెలుగు లెఫ్టిస్ క్లబ్ ( టి.ఎల్.సి )

సంఘం లో ఎడమ చేతి వాటం గల ప్రతీ తెలుగు వారిని చేర్చుకుంటున్నారు తద్వారా సమాజానికి సేవ చేస్తున్నారు...



సమగ్ర భారతీయ తెలుగు కాలమాన సూచిక (జంత్రి)


                    మనం సమగ్రమైన భారత తెలుగు కాలమానాన్ని (జంత్రి) మరచిపోయి, అర్థంలేని గ్రెగోరియన్ (ఆంగ్ల) క్యాలండర్ ను అనుసరిస్తున్నాం అనే ఆవేదనతో...

      మన భారతీయ కాలమానం (జంత్రి) ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది.. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకృతికి విరుద్ధం అని భావించిన ఆయన...

         తెలుగు వారి కోసం మన భారతీయ కాలమాన సూచికని  ( జంత్రి )  అచ్చ తెలుగు లో ప్రతీ సంవత్సరం ముద్రించి ఉచితంగా అందచేస్తున్నారు ఆయన.

                    ఇందులో  తెలుగు మొదటి నెల అయిన చైత్రం తో మొదలయ్యి, చివరి నెల అయిన పాల్గుణం తో ముగుస్తుంది... 

ఆంగ్ల క్యాలెండర్ మాదిరి జనవరి నుండి డిసెంబర్ ఉండదు...

                       తిధుల ద్వారా గణింపబడిన ఈ భారతీయ తెలుగు కాలమాన సూచిక ను ( క్యాలెండర్ ) ని రూపొందిస్తున్నారు, ఇదే నిజమైన కాల సూచిక...

                      ప్రతీ సంవత్సరం ఈ భారతీయ కాల సూచిక (జంత్రి) ను చైత్రం మాసపు మొదటి రోజయిన చైత్ర శుద్ధ పాడ్యమి రోజున అనగా ఉగాది  పర్వదిననా విడుదల చేస్తున్నారు రామ్ కర్రి .




ఇలాంటి మరెన్నో సేవలను సమాజం కోసం స్వచ్ఛందంగా చేస్తున్నారు...




వెబ్సైట్

వాట్సాప్ 

          

యూట్యూబ్ 

వాట్సాప్ గ్రూప్స్ లింక్ 

టెలిగ్రామ్ గ్రూప్ 

లింక్డ్ ఇన్ 

ట్విట్టర్ 


ఫేస్బుక్ 


గూగుల్ మ్యాప్ 



చిరునామా 

రాంకర్రి జ్ఞాన కేంద్ర ,
1 - 240 , రాజ రాజేశ్వరీ కాలనీ ,
రాయవరం , రాయవరం మండలం ,
తూర్పుగోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ - 533346







◆ ◆ ◆

Thursday, January 26, 2017

thumbnail

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - Happy Republic Day 2017

రాజ్యాంగం మంచిదే కాని మంచి వారి చేతుల్లో ఉంటేనే మంచిది, చెడ్డవారి చేతుల్లో పడితే చెడ్డదే అవుతుంది” —అంబేద్కర్.

ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం అని అబ్రహం లింకన్ అన్నాడు.

ప్రజా స్వామ్యానికి మూల గ్రంథం లాంటిది మన రాజ్యాంగం.

మరి మన రాజ్యాంగం గురించీ,గణతంత్రం గురించీ కొన్ని విషయాలు….

రాజ్యాంగం రాత ప్రతిని తయారు చెయ్యడం కొరకు 1947 ఆగష్టు 29 న రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్టు కమిటీని ఏర్పాటు చేసింది. డా.బి.ఆర్.అంబేద్కర్ ఈ కమిటీకి అధ్యక్షుడు..

“భారత ప్రజలమైన మేము, భారత్‌ను సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము,

సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం ,ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ, హోదాలోను, అవకాశాలలోను సమానత్వం, వ్యక్తి గౌరవాన్ని, దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడి సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పుతామని కూడా దీక్షాబద్ధులమై ఉన్నాము. 

1949 నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, ఆమోదించి, మాకు మేము సమర్పించుకుంటున్నాము…..”

Republic day 2

భారత ప్రజల అపార త్యాగాల ఫలితంగా దేశానికి రాజకీయ స్వాతంత్య్రం సిద్ధించింది. ఫలితంగా అందివచ్చినదే సర్వోత్కృష్టమైన భారత రాజ్యాంగం.

భారత దేశాన్ని సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యింగాన్ని నిర్మించుకునేందుకు పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, సమానత్వాన్ని చేకూర్చడానికి జాతీయ సమైక్యతనూ, సమగ్రతనూ సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి, 1949 నవంబరు 26వ తేదీన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించి, శాసనంగా రూపొందించుకున్నప్పటికీ, 1950 జనవరి 26 నుంచి 395 అధికరణలు, 22 భాగాలు, 9 షెడ్యూళ్ళతో అమల్లోకి వచ్చింది. ఆ రోజున ప్రపంచానికి భారత దేశం నూతన గణతంత్ర రాజ్యం(రిపబ్లిక్‌)గా ప్రకటించబడింది. ప్రస్తుతం 447 ఆర్టికల్స్‌, 26 అధ్యాయాలు, 12 షెడ్యూళ్ళు, 121 సవరణలతో కూడినది ఈ భారత దేశ బృహత్‌ రాజ్యాంగం..
  • స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం: 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు.
  • రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది.
  • రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది.
  • భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు.
  • 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి, భారత్ తాత్కాలిక పార్లమెంటు గా మారింది.
  • 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది.
  • మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నాయి, హిందీలో ఒక ప్రతి, ఇంగ్లీష్ లో ఒక ప్రతి ఉన్నాయి, ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌కేసులలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు, వాటి నకలును ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. 
  • మన రాజ్యాంగం జనవరి 26వ తేది ఉదయం 10:18 నిమిషాలకు అమలులోకి వచ్చింది.
  • 1930వ సంవత్సరంలో జనవరి 26వ తేదిని స్వాతంత్ర్య దినోత్సవం లేదా పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకొనేవారు, అంటే ఆరోజున భారతదేశం పూర్తి స్వేఛ్చ కోసం పోరాడడానికి నిర్ణయించుకున్న రోజు. 
భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. వాటిలో ముఖ్యమైనవి.
  1. ఏక పౌరసత్వం   —  బ్రిటన్
  2. పార్లమెంటరీ విధానం — బ్రిటన్
  3. స్పీకర్ పదవి  —  బ్రిటన్
  4. ప్రాథమిక హక్కులు  — అమెరికా
  5. సుప్రీం కోర్టు  —  అమెరికా
  6. న్యాయ సమీక్షాధికారం  —  అమెరికా
  7. భారతదేశంలో ఆదేశిక సూత్రాలు  —  ఐర్లాండ్
  8. రాష్ట్రపతి ఎన్నిక పద్దతి  —  ఐర్లాండ్
  9. రాజ్యసభ సభ్యుల నియామకం  —  ఐర్లాండ్
  10. భారతదేశంలో ప్రాథమిక విధులు  —  రష్యా
  11. కేంద్ర రాష్ట్ర సంబంధాలు  —  కెనడా
  12. అత్యవసర పరిస్థితి  —  వైమర్(జర్మనీ)
ఇలా ఎన్నో దేశాలు,మరెన్నో గ్రంథాలు.. ఎన్నో జాతుల జీవన విధానాలనూ పరిశోధించి ఏర్పరుచుకున్న భారత పరిపాలనా మార్గదర్శ గ్రంథం ఆమోదం పొందిన రోజు… స్వతంత్ర్యానంతర భారత దేశం రాజకీయంగా తన కంటూ ఒక స్వంత అస్థిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నరోజు. గణతంత్ర దినోత్సవం. దేశ సమగ్రతని కాపాడాల్సిన భారత పౌరులమైన మనం ఇంకొక్కసారి మన విజయాని గుండెలదిరేలా “మేరా భారత్ మహాన్” అని ప్రపంచానికి చెప్పే రోజు….  రామ్ కర్రి .కామ్ నుంచి మీకూ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.